కొవిడ్ వ్యాధి సోకిన వారికి అత్యవసర, మెరుగైన వైద్యం అవసరమైతే సేవలందించే క్రమంలో గాంధి, నిమ్స్ ఆసుపత్రులకు తరలించేందుకు మేడ్చల్ జిల్లాలో ఏడు ప్రత్యేక అంబులెన్స్లను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసుకుంది. కొవిడ్ వ్యాధి సోకిన వారి పరిస్థితి సీరియస్గా ఉంటే అంబులెన్స్లో తరలించి ప్రత్యేక వైద్యం అందించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఏడు ప్రాంతాలలో అంబులెన్స్లను అందుబాటులో ఉంచుతున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కాప్రా, అల్వాల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్లలో అంబులెన్స్ ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంటాయి. కొవిడ్ వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన వైద్యశాఖ వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. కొవిడ్ వ్యాధి సోకిన వారికి తక్షణమే వైద్యం అందించేందుకు అవసరమైన మందులను అందిస్తూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు అవగాహన కల్గిస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలో కొవిడ్ వ్యాధి అధికంగా విస్తరించిన ప్రాంతాలలో నాలుగు ప్రత్యేక మొబైల్ వాహనాల ద్వారా కొవిడ్ టెస్టులను నిర్వహిస్తున్నారు. కొవిడ్ వ్యాధి తీవ్రంగా విస్తరించిన ప్రాంతాలలో మొబైల్ వాహనాల ద్వారా టెస్టులు నిర్వహిస్తూ వ్యాధి విస్తరణ తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు నాలుగు వేల మందికి కొవిడ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు వెల్లడించారు.
కొవిడ్ వాక్సినేషన్ వేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రెండు రోజుల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాలలో 8200 మందికి పైగా వాక్సినేషన్లు వేయించుకుంటున్నారు. సెలవు రోజుల్లో సైతం కొవిడ్ పరీక్షలు, వాక్సినేషన్లను వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రో జురోజుకు వాక్సినేషన్ వేసుకునేందుకు రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
కొవిడ్ సోకిన వారికి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రత్యేక అంబులెన్స్ వాహనాలను వినియోగిస్తాం. జిల్లాలోని ఏడు ప్రాంతాలైన మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కాప్రా, అల్వాల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్లలో అంబులెన్స్ వాహనాలను అందుబాటులో ఉంచాం. కొవిడ్ తీవ్రత ఉన్న ప్రాంతాలలో నాలుగు ప్రత్యేక మొబైల్ వాహనాల ద్వారా కొవిడ్ టెస్టులను నిర్వహిస్తున్నాం. ప్రతి రోజు నాలుగు వేల పైచిలుకు మందికి కొవిడ్ టెస్టులు జరుగుతున్నాయి. వాక్సినేషన్ వేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రెండు రోజుల నుంచి 8200 మందికి వాక్సినేషన్లు వేస్తున్నాం. – మల్లికార్జునరావు, మేడ్చల్ జిల్లా వైద్యాధికారి