దుండిగల్, సెప్టెంబర్11: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం – దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎరోనాటికల్ ఇంజినీరింగ్(ఐఏఆర్ఈ) కళాశాలకు ‘నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ (ఎన్ఐఆర్ఎఫ్)-2021’లో 159వ ర్యాంక్ దక్కింది. భారతీయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రతి ఏడాది నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ (ఎన్ఐఆర్ఎఫ్)ను ఉత్తమ నాణ్యతా ప్రమాణాలు కలిగిన విశ్వ విద్యాలయాలు, మేనేజ్మెంట్, ఫార్మసీ, మెడికల్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్షర్ కళాశాలలకు ర్యాంకులను అందజేస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది దేశ వ్యాప్తంగా మొత్తం ఆరువేలకు పైగా కళాశాలల్లో ఐఏఆర్ఈ కళాశాలకు 159వ స్థానం దక్కింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ 2017 నుంచి ఐఏఆర్ఈ కళాశాల 200లోపే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ సాధించడం గర్వంగా ఉందన్నారు. టీచింగ్, రీసెర్చ్, ఎంప్లాయిబిలిటీ, ఇన్నోవేషన్లో ఐఏఆర్ఈ పాజిటివ్ పనితీరుకు, నాణ్యతా ప్రమాణాలకు ఇది నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కళాశాల సెక్రెటరీ, కరెస్పాండెంట్ సీహెచ్ సత్తిరెడ్డి, కోశాధికారి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.రాజేశ్వరరావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్వీ నరసింహప్రసాద్ ఐఏఆర్ఈ కళాశాలకు ఎన్ఐఆర్ఎఫ్