చర్లపల్లి, నవంబర్ 14 : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి.. పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్, కుషాయిగూడ, శివసాయినగర్లో ఆయన పర్యటించి.. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని కాలనీల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైనేజీ, మంచినీటి సమస్యలను వెంటనే పరిష్కరించడంతోపాటు పారిశుధ్య పనులు వేగవంతం, వీధిదీపాల నిర్వహణను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పద్మారెడ్డి, చల్లా వెంకటేశ్, కృష్ణ, దామోదర్రెడ్డి, అశోక్, కృష్ణారెడ్డి, సత్యనారాయణ, రాంచంద్రారెడ్డి, ఎస్కే కరీం, మర్రి శ్రీనివాస్రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్, సురేశ్గౌడ్ పాల్గొన్నారు.