మల్కాజిగిరి/నేరేడ్మెట్/వినాయక్నగర్/గౌతంనగర్ /అల్వాల్, ఏప్రిల్ 5 : దళితుల హక్కుల సాధనలో నిర్విరామ కృషి చేసిన సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్రామ్ అని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా చింతల బస్తీ, బీజేఆర్నగర్లలో పాల్గొన్నారు. కార్పొరేటర్ ప్రేంకుమార్, మేకల సునీతరాముయాదవ్ పలువురు నాయకులు హజరై బాబూజగ్జీవన్రాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేరేడ్మెట్ చౌరస్తాలో కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్రెడ్డితో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషిచేసిన మహోన్నత వ్యక్తిగా బాబూ జగ్జీవన్రామ్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.