అంకారా : టర్కీలో జరిగిన బస్సు ప్రమాదంలో 12 మంది మృతిచెందగా మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలస కూలీలతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఓ గుంతలో పడటంతో బస్సు నుజ్జునుజ్జు అయి మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఇరాన్తో టర్కీ సరిహద్దుకు సమీపంలో ఉన్న వాన్ ప్రావిన్స్ మురాడియే జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. వలసదారులు యూరప్కు వెళ్లేందుకు టర్కీ కీలక పాయింట్గా ఉంది. ఇరాన్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఎక్కువగా వలసకార్మికులు తరచుగా ఇరానీయన్ సరిహద్దు గుండా టర్కీలోకి ప్రవేశిస్తుంటారు.