బీర్కూర్/కోటగిరి, జూలై 7 : అన్నదాతల ఆత్మగౌరవమే ముఖ్యమని.. ఒక్క గుంట పొలం కూడా ఎండనివ్వబోమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్, కోటగిరి మండల కేంద్రాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో నిర్మించిన రైతు వేదికలను స్పీకర్ ప్రారంభించారు. బీర్కూర్లోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని ఆయన దర్శించుకున్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ప్రారంభించి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకన్న కొండపై ముఖ్యమంత్రి సహకారంతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. నూతనంగా మంజూరైన కళాశాలలో విద్యార్థులు బాగా చదువుకొని కళాశాలకు మంచిపేరు తేవాలన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు అభివృద్ధి పనులకు నిధులు తేవాలంటే గగనమైన పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు స్వతహాగా నిధులు మంజూరు చేసుకుని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా బీర్కూర్ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు లక్షలాది రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి మిషన్ భగీరథ పథకం పనుల్లో నిర్లక్ష్యం వీడాలని, పనులను త్వరగా పూర్తి చేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. కోటగిరిలో రూ.3 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించి మొక్కను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు.
అర్హులైన పేదవారికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. రైతులు ఒకే రకమైన పంట సాగు చేయకుండా పంట మార్పిడి, ఆదాయం వచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు. రెండు పంటలకు సాగు నీరందించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం నుంచి నిజాంసాగర్కు నీటిని మళ్లించామన్నారు. పాలిటెక్నికల్ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్ వసతి ఉందా అని అడిగి తెలుసుకున్నారు. ఫర్నిచర్ లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి కదా అని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పనితీరుపై పోచారం శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
బీర్కూర్ కార్యక్రమానికి సర్పంచ్ అవారి స్వప్న అధ్యక్షత వహించగా, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం సురేందర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, జడ్పీటీసీ స్వరూప, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, కోటగిరి కార్యక్రమంలో ఎంపీపీ సునీతాశ్రీనివాసరావు, జడ్పీటీసీ శంకర్పటేల్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్పటేల్, స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ నీరడి గంగాధర్, ఎన్డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ శాంతేశ్వర్పటేల్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొల్లూర్ కిశోర్బాబు, శివరాజ్దేశాయ్, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, విండో చైర్మన్ కూచి సిద్దూ, ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.