కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ఖేలా హోబె దివస్ను పురస్కరించుకొని రాష్ట్రంలోని స్పోర్ట్స్ క్లబ్లకు 50 వేల ఫుట్బాల్లు అందించనుంది. అయితే ఈ ఖేలా హోబె దివస్ ఎప్పుడన్నది ఇంకా ప్రకటించలేదు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి మమతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఖేలా హోబె నినాదంతోనే బరిలోకి దిగిన తృణమూల్ కాంగ్రెస్.. ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నినాదం బెంగాల్ ఓటర్లను బాగా ఆకట్టుకుంది.
ఇప్పుడిదే ఖేలా హోబె దివస్ పేరుతో ఓ వేడుక నిర్వహించి, ఆరోజు రాష్ట్ర రెఫ్యూజీ హ్యాండ్క్రాఫ్ట్ యూనిట్ చేత్తో తయారు చేసిన ఫుట్బాల్స్ను క్లబ్స్కు అందించనున్నట్లు ఆ అధికారి చెప్పారు. ఈ తేదీ ప్రకటించకపోయినా.. జులైలోనే ఉంటుందని ఆయన తెలిపారు. ఇప్పటికే జిల్లాల్లోని అధికారులు.. తమ దగ్గర ఉన్న అర్హత గల క్లబ్స్ పేర్లను సెక్రటేరియట్కు పంపించారు.