తెలంగాణచౌక్, జూన్ 21: లెఫ్టిస్ట్నని చెప్పుకునే ఈటల రాజేందర్ క్యాపిటలిస్ట్ పార్టీ అయిన బీజేపీలోకి ఎందుకువెళ్లాడో ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్తున్న ఆయనకు ఆ పార్టీలో ఏ మేరకు ఆత్మగౌరవం దక్కుతుందో ఆలోచించుకోవాలన్నారు. కరీంనగర్లోని సీపీఐ కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోవడం సరికాదన్నారు.