పల్లేర్లు మొలిచిన నేలలో కాళేశ్వర గంగ పారింది ఈ రోజే. ఎండిన పంటభూములు తడిచింది ఈ రోజే. తెలంగాణ రైతన్నల కాళ్లు కడిగింది ఈ రోజే. రాష్ట్ర ప్రజల కోసం ఏకంగా గోదావరి నదిని ఎత్తిపోసింది ఈ రోజే. తెలంగాణ వరప్రదాయిని, చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితం చేసి నేటికి రెండేండ్లు. 2019 జూన్ 21న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి ప్రారంభోత్సవం చేసిన విషయం తెలిసిందే.
– కరీంనగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి, పెద్దపల్లి(నమస్తే తెలంగాణ)