హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఇందులో రిజిస్ట్రార్, లైబ్రేరియన్, ఎస్ఏఎస్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 15
ఇందులో రిజిస్ట్రార్ 1, లైబ్రేరియన్ 1, ఎస్ఏఎస్ ఆఫీసర్ 1, ఎస్ఏఎస్ అసిస్టెంట్ 1, జూనియర్ ఇంజినీర్ 2, టెక్నీషియన్ 4, సీనియర్ టెక్నీషియన్ 1, జూనియర్ అసిస్టెంట్ 4 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: జూనియర్ ఇంజినీర్ పోస్టుకు సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్లో సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. మిగిలిన పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 10
వెబ్సైట్: www.nitandhra.ac.in