ఆ దిశగా చర్యలు తీసుకోవాలి
వీసీలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్కుమార్
గద్వాల, జూన్ 5 : రైతుబంధు పెట్టుబడి సాయం అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవడంతోపాటు ధరణిలో ఉన్న పెండింగ్ దరఖాస్తులు ఈ నెల 9లోగా క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి పెండింగ్ సమస్యలు, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు, నూతన కలెక్టరేట్ భవనాల పనులపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకుగానూ ప్రతి జిల్లాలో ప్రత్యేక ఆహార శుద్ధి జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందు లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 91 జోన్లు గుర్తించామని, ప్రతి జిల్లాలో వంద ఎకరాల స్థల సేకరణ ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని తెలిపారు. వీటిలో నీరు విద్యుత్ శక్తి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ శృతిఓఝా మాట్లాడుతూ.. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు స్థలం గుర్తించామన్నారు. ధరణి రిజిస్ట్రేషన్ల విధానంపై తాసిల్దార్, గ్రామపంచాయతీ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కలెక్టరేట్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు.
వీసీలో అదనపు కలెక్టర్లు రఘురాం శర్మ, శ్రీహర్ష, ఆర్డీవో రాములు, ఆర్అండ్బీ ఈఈ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.