నారాయణపేట, మే 24 : ఇంటింటి సర్వేకు వచ్చే సిబ్బందికి కొవిడ్ లక్షణాలు ఉన్న వారు వివరాలు అందజేయాలని కౌన్సిలర్ జొన్నల అనిత కోరారు. సోమవారం పట్టణంలోని 2వ వార్డులో ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వే చేపట్టారు. కార్యక్రమంలో ఆశ వర్కర్ శివమ్మ, అంగన్వాడీ టీచర్ గీత, మున్సిపల్ సిబ్బంది దేవరాజ్ పాల్గొన్నారు.
ఫీవర్ సర్వే పూర్తి..
ఊట్కూర్, మే 24 : కరోనా వైరస్ సెకండ్ వేవ్ నియంత్ర ణలో భాగంగా చేపట్టిన జ్వర సర్వే వందశాతం పూర్తయిందని ఎంపీడీవో కాళప్ప అన్నారు. సోమవారం నుంచి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జ్వర సర్వే చేపట్టినట్లు తెలిపారు. ఊట్కూర్, పెద్దజట్రం, కొల్లూరు, మొగ్దుంపూర్ గ్రామాల్లో పర్యటించి సర్వే ప్రక్రియను పరిశీలించారు. అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది, గ్రామ కార్యదర్శులు ఇంటింటికీ తిరిగి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించారు. ప్రజలు తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే సంబంధిత దవాఖానలో చికిత్స పొందాలని సూచించారు. లక్షణాలు కనిపించిన పలువురికి ఇంటి వద్దనే మందులను అందజేశారు.