ముంబై ,మే 24: మారుతీ సుజుకీ స్విఫ్ట్.. ఎంతో అద్భుతమైన మోడల్ ఇది. ఎంతో స్టైలిష్ కార్ ఇది. దీని మైలేజీ వచ్చేసి లీటరుకు ఎక్కువగా 23.76 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. ఎక్స్ షోరూంలో ఈ కారు ధర వచ్చేసి రూ.6.86 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక అలాగే ప్రస్తుతం భారత మార్కెట్లో దూసుకుపోతున్న అత్యుత్తమ మైలేజినిచ్చే పెట్రోల్ కార్లలో సెలేరియో మోడల్ ముందు వరుసలో ఉంది.
ఎస్-ప్రెసో, వాగన్-ఆర్ మోడళ్లలో ఉన్న ఇంజిన్ నే ఇందులోనూ వాడారు. పవర్ ఔట్ పుట్ కూడా ఆ కార్లలో వున్నట్లే ఉంది.అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. లీటరుకు గరిష్ఠంగా 21.63 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుంది. ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ.5.42 లక్షలుగా కంపెనీ డిసైడ్ చేసింది.
మైలేజి ఎక్కువగా ఇచ్చే కార్లలో మంచి పర్ఫెక్ట్ కార్ డాట్సన్ రెడీ-గో. ఇది లీటరుకు గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వరకు మైలేజీనిస్తుంది. అంతేకాకుండా 1.0-లీటర్ ఇంజిన్ ను కలిగి ఉండి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఎక్స్ షోరూం ఈ సరికొత్త డాట్సన్ వాహనం ప్రారంభ ధర వచ్చేసి రూ.4.92 లక్షలుగా సంస్థ నిర్దేశించడం జరిగింది. అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికత, ప్రత్యేకతలున్నఈ కారు వాహన ప్రియులను ఆకర్షిస్తున్నది.
ఇక మరో కార్ మారుతి సుజుకి డిజైర్ 1.2-లీటర్ డ్యూయల్ జెట్ యూనిట్ ఇంజిన్ ను కలిగి ఉంది. గతంలో కంటే మెరుగైన పవర్ ఔట్ పుట్ తో పాటు అత్యుత్తమ మైలేజినిచ్చేలా దీనిని డిజైన్ చేయ్యడం జరిగింది. ఈ సరికొత్త డిజైర్ మోడల్ లీటరుకు ఎక్కువగా 24.12 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుంది. అంతేకాకుండా 88 హార్స్ పవర్ హెచ్ పీ, 113 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ 1.2-లీటర్ మోటార్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఎక్స్ షోరూంలో ఈ వాహనం ధర వచ్చేసి రూ.7.41 లక్షల నుంచి రూ.8.90 లక్షలు పలుకుతుంది.