సూర్యాపేట: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెమ్మికల్ శివారులోని మామిడి తోటలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని ఆత్మకూర్ (ఎస్) మండలం బోరింగ్ తండాకు చెందిన భూక్య సోములు (36)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఇవాళ ఉదయం జిల్లాలో మరో హత్య జరిగింది. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో రేఖా బాయమ్మ (50) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి దుండగులు దహనం చేశారు. బయ్యమ్మ తన భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్నది.