హైదరాబాద్: నగరంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన బోయిన్పల్లి మార్కెట్ యార్డులో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మార్కెట్లోని వేబ్రిడ్జిలో అక్రమాలు జరుగుతున్నాయని అధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేబ్రిడ్జిలో లోపాలున్నట్లు గుర్తించింది. ఈనేపథ్యంలో అందులో ఉన్న సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకుని, వేబ్రిడ్జిని సీజ్ చేశారు. మార్కెట్లో అక్రమాలకు పాల్పడకూడదని, అలాంటివారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇకపై తరచు తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి