జహీరాబాద్, మే 14: విశ్వగురువు బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఎమ్మె ల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ క్యాంపు కార్యాలయంలో బసవేశ్వరుడిని చిత్ర పటానికి పూలమాల వేసి చేసిన సేవలను కొనియాడారు. బసవేశ్వరుడు కుల వ్యవస్థను నిర్మూలించేందుకు ఎంతో కృషి చేశారన్నారు. భూమిపై ఉన్న మానవులు అంతా ఒక్కటేనని కుల, మతా బేధాలు లేకుండా జీవించాలన్నారు. రాజకీయ, ఆర్థిక హక్కుల కల్పించేందుకు ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, కేతకీ సంగమేశ్వర దేవాలయం చైర్మన్ వెంకటేశం, టీఆర్ఎస్ నాయకులు నామ రవికిరణ్, లింగాయత్ సమాజ్ ప్రధాన కార్యదర్శి సుభాశ్, మోహినుద్దీన్, బాబీ తదితరులు ఉన్నా రు. హుగ్గెల్లి చౌరస్తాలో విగ్రహానికి లింగాయత్ సమాజ్ నాయకులు పూలమాలలు వేశారు.
గ్రామాల్లో బసవేశ్వరుడి జయంతి
నారాయణఖేడ్, మే 14: బసవేశ్వరుడి 888వ జయంతి వేడుకలను నారాయణఖేడ్తో పాటు ఆయా గ్రామాల్లో ఘనంగా జరుపుకొన్నారు. వీరశైవలింగాయత్ సమాజ్ పిలుపు మేరకు కొవిడ్ నిబంధనల దృష్ట్యా ఎవరికి వారు తమ ఇండ్లల్లో బసవేశ్వరుడి చిత్రపటాలకు పూజలు చేయడంతో పాటు షటస్థల జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా మండల పరిధిలోని బాణాపూర్లో జిల్లా పౌరసరఫరాల విజిలెన్స్ కమిటీ సభ్యుడు చన్బసప్ప గ్రామంలోని బసవేశ్వరుడి విగ్రహానికి పూజలు చేసి జెండాను ఆవిష్కరించారు.
కొవిడ్ నిబంధనలతో..
అందోల్, మే 14: మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను శుక్రవారం నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కొవిడ్-19 నిబంధనల మేరకు గ్రామాల్లోన్ని మహాత్మా బసవేశ్వరుడి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందోల్, హత్నూర, వట్పల్లి, పుల్కల్, చౌటకూర్, రాయికోడ్, మునిపల్లి మండల్లాలో లింగాయత్ సమాజ్ నాయకుల ఆధ్వర్యంల్లోని వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొన్ని ఆయన సేవలను కొనియాడారు. అందోల్ తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ అశోక్ ,సిబ్బంది బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.
పోలీసులకు మాస్కుల పంపిణీ
నారాయణఖేడ్ టౌన్: మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా శుక్రవారం నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్రెడ్డి, పోలీస్ సిబ్బందికి, విలేకరులకు ఎన్ 95 మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ స్టేట్ యూత్ కమిటీ ఇన్చార్జి అరుణ్రాజ్ శేరికర్ పాల్గొన్నారు.
తహసీల్ కార్యాలయంలో..
కంగ్టి, మే 14: మండల కేంద్రమైన కంగ్టితో పాటు ఆయా గ్రామాల్లో శుక్రవారం ప్రజలు ఘనంగా బసవజయంతి పర్వదినాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా తహసీల్ కార్యాలయ ఆవరణలో కూడా బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.