బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధే. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్లో వాంటెడ్, దబంగ్ 3 సినిమాలు వచ్చాయి. ఇందులో వాంటెడ్ సూపర్ హిట్ అయింది. పోకిరి సినిమా రీమేక్ అది. ఇదిలా ఉంటే తాజాగా రాధే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ప్రభుదేవా, సల్మాన్ ఖాన్. కరోనా సమయంలో కూడా ఈ సినిమాను ధైర్యంగా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దీని కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఒకవైపు థియేటర్లలో సినిమాని విడుదల చేస్తూనే మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫామ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో ఇలా విడుదలవుతున్న తొలి పెద్ద సినిమా ఇదే.
జి స్టూడియోస్ ఈ సినిమాను విడుదల చేస్తుంది. పే ఫర్ వ్యూ పద్ధతిలో రాధే సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను చూడాలంటే 249 రూపాయలు చెల్లించాలి. అలా చెల్లిస్తే ఇంట్లోనే కూర్చుని తొలి రోజు తొలి ఆట చూడొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా నిడివి గురించి సోషల్ మీడియాలో ఇప్పుడూ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. సాధారణంగా సల్మాన్ ఖాన్ సినిమా అంటే కనీసం రెండున్నర గంటలు ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉన్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు రాధే సినిమా మాత్రం చాలా తక్కువ రన్ టైంతో వస్తుంది.
ఈ సినిమా కేవలం 1 గంట 54 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలుస్తుంది. అది తెలిసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. సల్మాన్ లాంటి ఒక పెద్ద హీరో ఉన్న సినిమాను ఇంత త్వరగా ముగిస్తారా అంటూ దర్శకుడు ప్రభుదేవాని ప్రశ్నిస్తున్నారు అభిమానులు. పోకిరి సినిమాకు సీక్వెల్గా రాధే తెరకెక్కించాడు ప్రభుదేవా. ఇది అఫీషియల్గా ప్రకటించకపోయినా కూడా ట్రైలర్ చూస్తుంటే విషయం అర్థమైపోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నెటిజన్ కామెంట్..హేమ రిప్లై ఇదే..!
సురక్షితంగా ఉండండి.. సంక్షోభం నుండి బయటపడుతాం : మహేశ్బాబు
కరోనా ఎఫెక్ట్.. తండ్రికి క్షవరం చేసిన బండ్ల గణేష్
కరోనా నుండి కోలుకున్న పవన్ కళ్యాణ్
ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో లేనట్టేనా ..!
అంత చేసినా చివరికి యువతిని కాపాడలేకపోయానంటూ సోనూసూద్ భావోద్వేగం
కంగనా రనౌత్కు కరోనా పాజిటివ్
క్రికెటర్ భువనేశ్వర్ యాంకర్ శ్యామలకు సోదరుడా?