న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ స్థాయిని తెలుసుకోవటానికి చాలామంది ఇళ్లలోనే సొంతంగా ఆక్సీమీటర్లను ఉపయోగిస్తున్నారు. అయితే, దీనిని కూడా ఒక సరైన పద్ధతి ప్రకారం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకునేముందు 10-15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి.
చేతిని ఛాతిపై ఉంచి చూపుడు వేలు లేదా మధ్య వేలుకు ఆక్సీమీటర్ను తగిలించాలి.
ఆక్సీమీటర్ రీడింగ్ స్థిరంగా కొనసాగే వరకు అలాగే ఉంచాలి.
అధికంగా నమోదైన రీడింగ్ను పరిగణనలోకి తీసుకోవాలి.
ఒక్కరోజులో జరిపిన పరీక్షల్లో వచ్చిన ఫలితాలను నమోదు చేయాలి.
శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురైనా, ఆక్సిజన్ స్థాయిలు 93 శాతం కన్నా తక్కువగా ఉన్నా డాక్టర్ను సంప్రదించాలి.