విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కళ్యాణి
ఆన్లైన్ క్లాసుల సౌకర్యం లేని పేదింటి విద్యార్థుల కోసం సుద్దాలకు వెళ్లి కాసులు
చెన్నూర్, ఏప్రిల్ 12 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్కూళను సర్కారు మూసివేసింది. ఆన్లైన్లోనే క్లాసులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కొంతమంది ఆన్లైన్ సౌకర్యం లేక, మరికొందరు అర్థం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఇండ్లకే వెళ్లి క్లాసులు తీ సుకుంటున్నారు చెన్నూర్ మండలం సుద్దాల జడ్పీ పాఠశాల ఇంగ్లిష్ టీచర్ రాచకొండ కళ్యాణి. స్కూల్లో అందరూ పేద విద్యార్థులే కావడం.. సరైన సౌకర్యాలు అందుబాటు లో లేకపోవడంతో టీచరే స్వయంగా మంచిర్యాల నుంచి సుద్దాల వెళ్లి విద్యార్థులను కలుసుకుంటున్నారు. 6 నుంచి 10 వ తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఇందుకోసం వారిని గ్రూపుగా తయారుచేసి, బాసరలో ట్రిపుల్ ఐటీ మొదటి సంవత్సరం చదువుతున్న పూర్వ విద్యార్థిని మమత సా యం తీసుకుంటున్నారు. విద్యార్థులకు అవసరమైన పా ఠ్యాంశాలను ల్యాప్టాప్లో క్లాసుల రూపకంగా చూపిస్తూ నే, అవసరమైన అంశాలను అందరికీ కలిపి ఉన్న ఒక సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇస్తున్నారు. ఇప్పటికే 9, 10 తరగతులకు సిలబస్ పూర్తి చేయగా, 7, 8 తరగతుల పాఠ్యాం శాలు ఆఖరికి చేరుకున్నాయి. విద్యార్థులు చదువుకు దూరం కాకుండా టీచరే ఇంటికి వచ్చి బోధించడం అభినందనీయమని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టీచర్ ఇంటికే వచ్చి క్లాస్ చెబుతున్నారు..
బడికి సెలవులు ఇచ్చిన్రు. ఆన్లైన్ క్లాసులు ఒక్కోసారి అర్థమయితలేవు. కొందరికి క్లాసులు వినేందుకు సెల్ ఫోన్లు కూడా లేవు. అందుకే మా ఇంగ్లిష్ టీచర్ ఇక్కడికే వస్తున్నరు. కొంతమందిని గ్రూపుగా చేసి క్లాసు చెబుతు న్నరు. ఇయ్యాల మా వాడలో ఉన్న ఎనిమిది మందికి ఒకే చోట క్లాస్ చెప్పిన్రు. ఇంగ్లిష్లో మాకున్న సందేహాలను నివృత్తి చేసిన్రు.
-దేనబోయిన మౌనిక, ఏడో తరగతి
చదువులో వెనుకబడవద్దనే..
సుద్దాలలోని జడ్పీ హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న. కరోనా నేపథ్యంలో బోధన నిలిచిపో యింది. పాఠశాలకు వ చ్చేవారంతా పేద విద్యార్థులే. వీరిని గ్రూప్లుగా తయారు చేసి, క్లాసులు చెప్పాలని అను కున్నా. ఇప్పటికే 9,10 తరగతులకు సిలబస్ పూర్తయింది. ఇక 7, 8 తరగతుల విద్యార్థులను కలిసి, అవసర మై న పాఠ్యాంశాలను వివరంగా చెబుతున్నా. దీంతో వారి తల్లిదండ్రులు కూడా సంతోషిస్తున్నారు. ఆన్లై న్ సౌకర్యం లేని కొందరు చదువులో వెనుకబడవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నా.
రాచకొండ కళ్యాణి, స్కూల్ అసిస్టెంట్
ఇవి కూడా చదవండి
ఇట్స్ ఆఫీషియల్.. కొరటాల శివతో మరోసారి ఎన్టీఆర్
మాస్క్ పెట్టుకోకుంటే.. ఫైన్ కట్టాల్సిందే !