నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై చేతులెత్తేసిన ఎంపీ
స్పైసెస్ బోర్డు పాలకవర్గం కూర్పులోనూ కనిపించని చొరవ
ఆంధ్రా నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావుకు చోటు
తెలంగాణ ఎంపీలకు చోటు కల్పించడంలో కేంద్ర సర్కారు వివక్ష
స్పైసెస్ బోర్డు డొల్లతనం బయటపడుతుందనే ప్రధాన కారణం
రాష్ట్రం నుంచి నామ్కే వాస్తేగా మేడ్చల్ వాసికి స్థానం
నిజామాబాద్, మార్చి 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి):పసుపు బోర్డు ఏర్పాటు చేసేది లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో ఎంపీ అర్వింద్ స్పైసెస్బోర్డును తెరమీదికి తెచ్చి రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సెంటర్తో ఎలాంటి ప్రయోజనం లేకపోయినా అరచేతిలో స్వర్గం చూపించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. మరోవైపు స్పైసెస్ బోర్డు పాలక వర్గంలోనూ తెలంగాణ ప్రాంతానికి ప్రాధాన్యత దక్కకపోవడంపై రైతులు ఎంపీ అర్వింద్ను ప్రశ్నిస్తున్నారు. స్పైసెస్ బోర్డుకు 32 మంది సభ్యులతో కూడిన పాలకవర్గం ఉంటుంది. అర్వింద్ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలక వర్గం కూర్పు జరిగింది. ఇందులో పసుపు పంట పండిస్తున్న ప్రాంతాల నుంచి ఏ ఒక్కరికీ చోటు దక్కలేదు. 2020 జనవరిలో ఆంధ్రా ప్రాంతం నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు స్థానం కల్పించారు. రాష్ట్ర ఎంపీలకు మాత్రం మొండి చేయి చూపించారు. స్పైసెస్ బోర్డుకు సంబంధించిన శాస్త్రీయ, సాంకేతిక, అధికారిక సమాచారంపై ఏనాడూ మాట్లాడని ఎంపీ అర్వింద్… పదే పదే రెచ్చగొట్టే ప్రసంగాలకే పరిమితం కావడంపై పసుపు రైతులు మండిపడుతున్నారు.
పసుపుబోర్డు ఏర్పాటుపై గుడ్లు తేలేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన పదవికి రాజీనామా చేయాలంటూ రైతుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. దీంతోపాటు తానిచ్చిన హామీని తమ ప్రభుత్వమే పట్టించుకోకపోవడంతో ఆయనకు ఎటూ పాలుపోవడంలేదు. పసుపు బోర్డు వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు 2017లోనే ప్రతిపాదించిన స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కమ్ రీజినల్ సెంటర్ ఏర్పాటును తన ఖాతాలో ఎంపీ అర్వింద్ వేసుకుంటున్నారు. ఈ సెంటర్తో ఎలాంటి ప్ర యోజనం లేకున్నా ప్రగల్భాలు పలుకుతున్నారు. పసు పు రైతులకు లాభాలు జరుగుతాయంటూ చెప్పుకొస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చి కేంద్రంగా పని చేస్తున్న స్పైసెస్ బోర్డుకు 32 మంది సభ్యులతో కూడిన పాలకవర్గం ఉంటుంది. ఇందులో లోక్సభ, రాజ్యసభ సభ్యులకు, సుగంధ ద్రవ్యాల ఎగుమతి, దిగుమతిదారులు, రైతులు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. వీరి పదవీ కాలం మూడేండ్లు. అర్వింద్ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన త ర్వాత పాలక వర్గం కూర్పు జరిగింది. ఇందులో పసుపు పంట పండిస్తున్న ప్రాంతాల నుంచి ఒక్కరికీ చోటు లేదు. పైగా 2020 జనవరిలో ఆంధ్రా ప్రాంతం నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావుకు స్థానం కల్పించారు. తెలంగాణ ఎంపీలకు మాత్రం మొండి చేయి చూపించారు. స్పైసెస్ బోర్డుకు సంబంధించిన శాస్త్రీయ, సాంకేతిక, అధికారిక సమాచారంపై ఏనా డూ మాట్లాడని ఎంపీ అర్వింద్.. పదే పదే రెచ్చగొట్టే ప్రసంగాలకే పరిమితం కావడంపై పసుపు రైతులు మండిపడుతున్నారు.
అర్వింద్ నీ ఘనకార్యం ఎక్కడా?
స్పైసెస్ బోర్డుపై అరచేతిలో స్వర్గం చూపిస్తున్న ఎంపీ అర్వింద్కు పసుపు రైతులు రోజుకొక సవాల్ను విసురుతున్నారు. సుగంధ ద్రవ్యాల బోర్డు పాలకవర్గంలో తెలంగాణ ప్రాంతానికి ఎందుకు ప్రాధాన్యత దక్కలేదో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 2018లో యూపీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని పొందిన ఏపీకి చెందిన బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావుకు 2020, జనవరిలో కేంద్రం నేరుగా స్పైసెస్ బోర్డులో సభ్యత్వం కల్పించింది. ఉత్తరాదికి ప్రాతినిథ్యం వహించే ఆయనకు చోటు దక్కగా తెలంగాణ ప్రాంతం నుంచి ఏ ఒక్క ఎంపీకి స్థా నం లేకుండా పోయింది. వాస్తవానికి స్పైసెస్ బోర్డు ద్వారా పసుపు రైతులకు మేలు చేకూరుతుందని అనుకుంటే పసుపు పంట విస్తారంగా సాగవుతున్న ప్రాంతాల నుంచి రైతులకు చోటు ఇవ్వాలి కదా? అంటూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అదీగాక లోక్సభ సభ్యుల కోటా నుంచి ఇద్దరికి అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ నుంచి ఏ ఒక్క ఎంపీకి ఎందుకు
యాలకుల నుంచి స్పైసెస్ దాకా..
దేశంలో యాలకుల ఉత్పత్తికి కేరళ రాష్ట్రం ప్రసిద్ధి. మనం ఇలాచీలుగా పిలుచుకునే యాలకులు సుగంధ ద్రవ్యాలుగా దశాబ్దాలుగా గుర్తిస్తున్నారు. భారత ప్రభు త్వం 1960లోనే సుగంధ ద్రవ్యాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. 1968 లో ప్రత్యేకంగా యాలకుల బోర్డును స్థాపించింది. ఈ రెండింటిని విలీనం చేసి 1986, ఫిబ్రవరి 26న స్పైసెస్ బోర్డును ఏర్పాటుచేశారు. ప్రస్తు తం ఇందులో 52 రకాల సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. పశ్చిమ కనుమలకు ఆనుకుని ఉన్న రాష్ర్టాల్లో ఉత్పత్తి అయ్యే సుగంధ ద్రవ్యాలకు మాత్రమే స్పైసెస్ బోర్డు మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తుంది. దక్కన్ పీఠభూమిలో జోరుగా సాగయ్యే పసుపు పంటపై గడిచిన మూడున్నర దశాబ్దాలుగా స్పైసెస్ బోర్డు సాధించిన భారీ ప్రగతి అంటూ ఏదీ లేదన్నదీ పసుపు మార్కెట్కు సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. పేరుకు మాత్రమే రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేసి, పేపర్ వర్క్ చేయడంతోనే సరిపెట్టుకుంటున్నట్లుగా నిపుణులు చెబుతున్నా రు. పసుపు ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటుచేయడం మినహా ఆయా సుగంధ ద్రవ్యాల బోర్డులు, ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ విలీనాలతో ఏర్పడినటువంటి స్పైసెస్ బోర్డుతో పసుపు రైతులకు చేకూరే ప్రయోజనం శూన్యమంటూ వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పసుపు ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు, పసుపు పంటకు కనీస మద్దతు ధర, పసుపు పరిశోధన వంటి అంశాల్లో రైతులకు లాభం దక్కాలంటే పసుపు బోర్డు ఒక్కటే శ్రీరామరక్షగా వ్యాపార, వాణిజ్య వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి.
నామినేట్ చేయలేదో చెప్పాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్పైసెస్ బోర్డులోని శాస్త్రీయ, సాంకేతిక అంశాలు కంటికి కనబడతలేవా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లా నుంచి విక్రమ్ రెడ్డికి సభ్యుడిగా అవకాశం ఉన్నప్పటికీ ఆయనకు పసుపు పంటకు సంబంధం లేకపోవడం శోచనీయం.
ముందు గొయ్యి… వెనుక నుయ్యి…
ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకు వస్తానని రైతులకు మాటిచ్చి గద్దెనెక్కిన ఎంపీ అర్వింద్ పరిస్థితి ప్రస్తుతం ముందు గొయ్యి… వెనుక నుయ్యి అన్న చందంగా మారింది. పసుపు రైతుల ప్రధాన ఆకాంక్షను నెరవేర్చడంలోఎంపీగా అర్వింద్ ఘోరంగా వైఫల్యం చెందారు. పచ్చ బంగారం ఉత్పత్తికి దోహదం చేసేందుకు కేంద్రంతో ఏడాదిన్నరగా ఆయన పోరాడింది లేదు. పైగా ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పసుపు బోర్డుకు బదులుగా స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్ ఏర్పాటుతో అర్వింద్ ఒక్కరే సంతృప్తి చెంది మిన్నకుండిపోయారు. రైతన్నలంతా పసుపు బోర్డు ఏర్పాటు ఒక్కటే మార్గమంటూ నిలదీస్తుంటే అర్వింద్ జవాబివ్వలేక అవమానభారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేంద్రంలో అర్వింద్ మాట చెల్లుబాటు కాకపోవడం, కేంద్ర పెద్దలెవ్వరూ ఆయనను పట్టించుకోకపోవడంతో రైతుల్లో, సాధారణ ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.