ఎంపీ రంజిత్రెడ్డి
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఐపీఎల్ ఆతిథ్య వేదికల్లో హైదరాబాద్ను చేర్చాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే నెల 9న మొదలయ్యే ఐపీఎల్లో హైదరాబాద్ లేకపోవడంపై శుక్రవారం లోక్సభలో ఆయన మాట్లాడారు. ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించకపోవడం పట్ల అభిమానులు నిరాశ చెందుతున్నారని అన్నారు. కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయనే కారణం చూపుతున్నారు కానీ ముంబై, ఢిల్లీ కంటే హైదరాబాద్లో చాలా తక్కువ కేసులు ఉన్నాయని చెప్పారు.