హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్లో ఈనెల 31 నుంచి 43వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ చాంపియన్షిప్ జరుగనుంది. నగరంలోని సరూర్నగర్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 4వ తేదీ వరకు టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెరుగైన క్రీడా సౌకర్యాల కోసం బడ్జెట్లోనూ భారీగా నిధులు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు, రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి పవన్కుమార్తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.