వనపర్తి : పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ టీఆర్ఎస్ అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన పార్టీ కార్యకర్త వనపర్తి మండలం రాజనగరంకు చెందిన తోకల వెంకటయ్య గౌడ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పార్టీ సభ్యత్వ నమోదు నుంచి మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును శుక్రవారం మృతుడి భార్య తోకల పార్వతికి రాజనగరంలోని వారి నివాసంలో మంత్రి అందించారు. పార్టీ కోసం పనిచేసిన వెంకటయ్య కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి తెలిపారు.