ఐదు రౌండ్లలో 18,549 ఓట్ల ఆధిక్యత
రెండో స్థానంలో చింతపండు నవీన్
మూడో స్థానంలో కోదండరాం
సుదీర్ఘంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
గెలుపు కోటాకు దూరంగా అభ్యర్థులు
నేటి ఉదయం నుంచి ద్వితీయ ప్రాధాన్యతా కౌంటింగ్
నల్లగొండ ప్రతినిధి, మార్చి 18(నమస్తే తెలంగాణ):వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతున్నది. బుధవారం ఉదయం 8గంటలకు కట్టలు కట్టే కార్యక్రమంతో మొదలు కాగా, గురువారం రాత్రి 10గంటల వరకు ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధిక్యత చూపుతూ వస్తుండగా నేటి ఉదయం వరకు ఏడో రౌండ్ ఫలితాలు రానున్నాయి. ఎవరికీ గెలుపుకోటా వచ్చే అవకాశం లేకపోవడవంతో ద్వితీయ ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు అనివార్యమని తెలుస్తున్నది. ఈ క్రమంలో శుక్రవారం రోజంతా కూడా కౌంటింగ్ జరుగనుంది.
ప్రతి రౌండ్లో పల్లాదే పైచేయి
నల్లగొండ ప్రతినిధి, మార్చి 18(నమస్తే తెలంగాణ): వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసా గుతుండగా, ప్రతి రౌండ్లో టీఆర్ఎస్ తన ఆధిక్యతను కొన సాగిస్తున్నది. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిదే పైచేయిగా నిలుస్తున్నది. గురువారం రాత్రి పది గంటల వరకు ఐదు రౌండ్ల తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు ముగిసే సరికి పల్లా 18,549 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆయనకు మొత్తం 79,113 ఓట్లు రాగా తర్వాత స్వతంత్ర అభ్యర్థి చింతపండు నవీన్ 60,564 ఓట్లతో రెండో స్థానంలో, టీజేఎస్ అభ్యర్థి కోదండరామ్ 49,200 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. వీరి తర్వాత స్థానాల్లో 28,991 ఓట్లతో బీజేపీ, 20,274 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థులున్నారు. ఇప్పటివరకు చెల్లిన ఓట్లను, ఆయా అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను పరిశీలిస్తే తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఎవ్వరికీ గెలుపు కోటా వచ్చే అవకాశాలు లేవు. దీంతో అనివార్యంగా ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. నేటి ఉదయం నుంచి లెక్కింపునకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులోనూ తేలకపోతే తృతీయ, ఆ తర్వాత ప్రాధాన్యతా ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోక తప్పదని తెలుస్తున్నది. శుక్రవారం అంతా కూడా లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.
ఆరు రౌండ్లు 30గంటలు..
తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు ఏడు రౌండ్లలో జరుగ నుండగా రాత్రి పది గంటల వరకు ఐదు రౌండ్లు పూర్త య్యాయి. ఆరో రౌండ్ కొనసాగుతుండగా, మరో రౌండ్ మిగిలి ఉండడంతో అది కూడా ఈ ఉదయానికి పూర్తి కా నుంది. బుధవారం ఉదయం 8గంటలకు మొదలైన ప్రక్రియ గురువారం అర్ధరాత్రి వరకు దాదాపు 30 గంటల పాటు నిరాటంకంగా సాగినా ఆరు రౌండ్లే పూర్తయ్యాయి. అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండడంతో ఒక్కో రౌండ్లో 56వేల ఓట్ల లెక్కింపుతో సుధీర్ఘంగా కౌంటింగ్ కొనసాగుతున్నది. అధికా రికంగా ఐదు రౌండ్ల ఫలితాలు వెల్లడికాగా ఇందులో ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధిక్య తను ప్రదర్శిస్తూ వచ్చారు. తొలి రౌండ్లో 4,084, రెండో రౌండ్లో 3,787, మూడో రౌండ్లో 3,816, నాలుగో రౌండ్లో 3,751, ఐదో రౌండ్లో 3,111ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ప్రతి రౌండ్లోనూ చెల్లిన ఓట్లలో సగ టున 30శాతం ఓట్లతో పల్లా రాజేశ్వర్రెడ్డి ముందంజలో ఉన్నారు. ఐదు రౌండ్లలో కలిపి మొత్తం 79,113 (29.91శాతం) ఓట్లు సాధించి 18,549 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. మల్లన్న 60,564 (22.90 శాతం), కోదండరామ్ 49,200 (18.60శాతం)ఓట్లను సాధించారు. అన్ని రౌండ్ల లోనూ తొలిస్థానంలో పల్లా, రెండోస్థానంలో మల్లన్న, మూడో స్థానంలో కోదండరామ్ కొనసాగుతూ వస్తున్నారు.
తప్పని ద్వితీయ ఓట్ల లెక్కింపు
మొదటి ప్రాధాన్యతా ఓట్లలో గెలుపు కోటాతో విజేత తేలే అవకాశాలు కనిపించడం లేదు. ఏడు రౌండ్ల ఓట్లు పూర్త య్యాక చెల్లిన ఓట్లలోంచి 50శాతం+1 గెలుపు కోటాగా నిర్ధా రిస్తారు. ఐదు రౌండ్ల వరకు ఉన్న చెల్లిన ఓట్లను ఉజ్జా యింపుగా తీసుకుని లెక్కెస్తే గెలుపు కోటాకు కనీసం 1.80 లక్షల ఓట్లు అవసరం పడనున్నాయి. తొలి ప్రాధాన్యతా ఓట్లలో గెలుపు కోటా ఎవరికీ వచ్చే అవకాశం లేనందున ద్వితీయ ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు తప్పనిసరి కానుంది. ఇక్క డ తొలి ప్రాధాన్యతా ఓట్లలో అతి తక్కువ సాధించిన అభ్యర్థికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లను బ్యాలెట్లో సూచించిన అభ్యర్థులకు పంచుతూ చివరి అభ్యర్థిని ఎలిమి నేట్ చేస్తారు. ఇలా మొత్తం 71 మంది అభ్యర్థులుండ గా ఒక్కొక్కరిని తొలి ప్రాధాన్యతా ఓట్లలో అతి తక్కువ నుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ వస్తారు. ఇలా చివరి ఇద్దరు అభ్యర్థులు మిగిలేదాకా కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా గెలుపు కోటా రాకపోతే తృతీయ ప్రాధాన్యతా ఓట్లను కూడా లెక్కిస్తారని తెలుస్తున్నది. ఇక శుక్రవారం కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2007లో శాసనమండలి పునరుద్ధరణ నాటి నుంచి జరిగిన అన్ని కౌంటింగ్లలోనూ ఇదే సుధీర్ఘమైన లెక్కింపు కానుంది. కాగా ఐదు రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి మొత్తం 2,79, 970 ఓట్లు లెక్కించగా అందులో 15, 533 ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. ఇవి మొత్తం ఓట్లలో 5.54శాతంగా ఉన్నాయి.