అహ్మదాబాద్: భారత్తో రెండో టీ20లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అదరగొట్టారు. ఆరంభంలో జేసన్ రాయ్(46: 35 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. డేవిడ్ మలన్(24), జానీ బెయిర్స్టో(20), ఇయాన్ మోర్గాన్(28), బెన్ స్టోక్స్(24) తమదైన శైలిలో ఆకట్టుకోవడంతో అలవకోగా 160 పరుగుల మార్క్ దాటింది. వరుస విరామాల్లో ఇంగ్లాండ్ వికెట్లు కోల్పోయినా అనూహ్యంగా భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు కోల్పోగా..భువనేశ్వర్ కుమార్, చాహల్ చెరో వికెట్ పడగొట్టారు.