దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
ఆదిలాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ సౌకర్యం కల్పిస్తున్నట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. శివరాత్రి వేడుకలకు హాజరుకావాలని వేముల వాడ ఆలయ ఈవో కృష్ణప్రసాద్, అర్చకులు భీమాశంకర్, ఉమేశ్ శర్మ ఆదివారం నిర్మల్లో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హెలికాప్టర్ను పర్యాటకశాఖ నడుపు తుందని, టికెట్ వివరాలను ఆ శాఖ త్వరలో వెల్లడిస్తుందని పేర్కొన్నారు.