‘నా ఇరవై ఏళ్ల కెరీర్లో తొలిసారి సినిమాతో నాకు సంబంధం లేకున్నా సినిమా చూసి నాకు బాగా నచ్చి ఆ టీమ్ను అప్రిషియేట్ చేయాలని అనుకున్నాను’ అన్నారు ‘దిల్’రాజు. అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో సతీష్ వేగేశ్న నిర్మించిన ‘నాంది’ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రముఖ నిర్మాత ‘దిల్’రాజు మంగళవారం చిత్రయూనిట్కు అప్రిషియేట్ మీట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దర్శకుడు ఈ చిత్రాన్ని ఎన్నో ట్విస్టులు, టర్న్లతో చక్కగా తెరకెక్కించాడు. లాయర్గా వరలక్ష్మి శరత్కుమార్ అభినయం అందర్ని అలరించే విధంగా వుంది. నరేష్ మంచి నటుడు అని మరోసారి ఈ చిత్రంతో నిరూపించుకున్నాడు. ఒక మంచి టీమ్తో మంచి సినిమా తీస్తే ఆ కిక్కే వేరు. డబ్బుతో పాటు గౌరవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, విజయ్ కనకమేడల, సతీష్ వేగేశ్న, వరలక్ష్మి శరత్కుమార్ పాల్గొన్నారు