కీసర, సెప్టెంబర్ 27: ఐదు నెలల గర్భిణికి పురిటినొప్పులు రావడంతో 108 సిబ్బంది అంబులెన్స్లోనే ప్రసవం చేసి తల్లి ప్రాణాలు కాపాడారు. కీసరకు చెందిన పూజ ఐదు నెలల గర్భవతి. సోమవారం ఉదయం ఆమెకు పురిటినొప్పలు వచ్చి రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారమిచ్చారు. ఈఎంటీ చిత్రం రవి ఆమెను అంబులెన్స్లో గాంధీ దవాఖానకు తరలిస్తుండగా, పురిటి నొప్పుల బాధ ఎక్కువ కావడం..రక్తస్రావం కూడా అవుతుండటంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించిన రవి వెంటనే 108 డాక్టర్ ఆలంకు పరిస్థితి వివరించాడు. ఆయన సూచనలతో అంబులెన్స్లో ఆమెకు బీపీ పడిపోకుండా గ్లూకోజ్ ద్రవాలు ఎక్కించి..రక్తస్రావాన్ని అదుపులోకి తెచ్చారు. అనంతరం సిబ్బంది ఎంతో చాకచక్యంగా ప్రసవం చేశారు. పూర్తిగా నెలలు నిండని బిడ్డ కడుపులోనే చనిపోయి బయటికి వచ్చింది. ప్రాణపాయస్థితిలో ఉన్న పూజను ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమెకు ఎలాంటి ప్రాణపాయం లేదని చెప్పారు. 108 ఈఎంటీ రవి, పైలెట్ రాజశేఖర్కు పూజ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.