హైదరాబాద్: నగర శివార్లలోని వనస్థలిపురంలో ముగ్గురు బాలికల కిడ్నాప్ కలకలం రేపింది. వనస్థలిపురం పీఎస్ పరిధిలోని ప్రగతినగర్లో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. నిన్న ఉదయం నుంచి తమ కూతుళ్లు ఐశ్వర్య (17), ఆస్మా (15), అబీర్ (14) కనిపించట్లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రగతినగర్కు చెందిన రమేశ్, అతని స్నేహితులు కిడ్నాప్ చేసినట్లు బాధిత బందువులు ఆరోపించారు. గతంలో ఐశ్వర్యను ప్రేమిస్తున్నానని రమేశ్ వెంటపడుతుండటంతో పలుమార్లు హెచ్చరించినట్లు పేర్కొన్నారు. దీంతో పోలీసులు రమేశ్ను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..