దుండిగల్,మార్చి5: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపే లక్ష్యంగా పార్టీశ్రేణులు పనిచేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వాణీదేవిని గెలింపించాలని ఆయన కోరారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్లోని ఏనుగుల బొమ్మల చౌరస్తావద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయంలో శుక్రవారం ఆయన మేయర్ కొలన్నీలాగోపాల్రెడ్డితో కలిసి కార్పొరేటర్లు, ముఖ్యనేతలతో సమావేశమాయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బూత్స్థాయిలో నియమితులైన నేతలు తమ పరిధిలోని ఇంటింటికీ తిరిగి పట్టభద్రులను కలిసి టీఆర్ఎస్కు ఓటువేసేలా కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీమేయర్ ధన్రాజుయాదవ్తో పాటు పలువురు కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు.
దుండిగల్, మార్చి5: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల స్థానం టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా టీఆర్ఎస్ నేతల ఇంటింటి ప్రచారం కొనసాగుతున్నది. ఆయా వార్డుల వారీగా నేతలు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో స్థానిక కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్రెడ్డి శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోలీస్గోవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలో 23వ వార్డు కౌన్సిలర్ మాదాసు వెంకటేశ్ శుక్రవారం బాలాజీ లేఅవుట్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రులను కలిసిన ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
సూరారం డివిజన్లో.. సురారం డివిజన్ పరిధిలోని శివాలయనగర్లో స్థానిక టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ వార్డు కమిటీ సభ్యులు జానకీరాం ఆధ్వర్యంలో పలువురు నేతలు గ్రాడ్యుయేట్లను కలిసి టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నేతలు దొడ్ల ఆంజనేయులు, విఠల్, ఉపేందర్, నర్సారెడ్డి పాల్గొన్నారు.