మేడ్చల్, మే 24: కరోనా కష్టకాలంలో కూడా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచి ఇంటి పెద్దగా ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో చాలా మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానందరెడ్డి, మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపికానర్సింరెడ్డి, ఎంపీటీసీల ఫ్లోర్ లీడర్ వెంకటేశ్, కో-ఆప్షన్ సభ్యురాలు రుక్సానా, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సర్పంచ్లు మాంగ్యా, వెన్నెల, మహేందర్, శేఖర్, కవిత, జయమ్మ, ఎంపీటీసీ కుమార్, పీఏసీఎస్ చైర్మన్లు సురేశ్రెడ్డి, రణదీప్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, మున్సిపల్ అధ్యక్షుడు శేఖర్గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
శామీర్పేట,మే 24:కల్యాణలక్ష్మి పథకంతో సీఎం కేసీఆర్ ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక చేయూతనిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. జవహర్నగర్ మున్సిపాలిటీకి చెంది న పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తుందన్నారు. పేదింటి ఆడబిడ్డలను సీఎం కేసీఆర్ సొంత మేనమామలా చూసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, తహసీల్దార్ గౌతమ్, నాయకులు పాల్గొన్నారు.