మెదక్ : తూప్రాన్ పట్టణంలోని అల్లాపూర్ టోల్గేట్ వద్ద నిర్మిస్తున్న రైతు బజార్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జూన్ మొదటివారంలో దీన్ని ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆధునిక మార్కెట్ సమీప గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించి వినియోగదారులకే నేరుగా తమ కూరగాయలను అమ్మవచ్చన్నారు. మార్కెట్ ఆవరణలో రైతులకు, వినియోగదారులకు, వ్యాపారులకు సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. అంతకుక్రితం ఎంపీ భవన నిర్మాణ పనుల పురోగతి, నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.