మెదక్ అర్బన్, అక్టోబర్ 22 : జిల్లా కేంద్రంలో విజయసాయి మొబైల్ షాప్లో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షాప్ తాళలు పగలగోట్టి 9 సెల్ఫోన్లు ఎత్తుఎళ్లిన్నట్లు మెదక్ పట్టణ సీఐ వెంకటయ్య శుక్రవారం తెలిపారు.
సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణంలోని విజయసాయి షాప్లో గుర్తు తెలియని వ్యక్తులు సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. మొబైల్స్ విలువ సుమారు రూ. 90,000 ఉంటుందన్నారు. షాప్లో నిందితుల వేలి ముద్రలే సేకరించామన్నారు. కేసు నమోదు చేసి దార్యప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటయ్య తెలిపారు.