చేగుంట: నిరుపేదల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు.నార్సింగి మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.లక్షా 116లను ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. రైతుల అభివృద్ధి కోసం రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామన్నారు.
మిషన్భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగు నీరును ప్రభుత్వం అందిస్తుందన్నారు. కేసీఆర్ తలపెట్టిన పల్లె ప్రగతిలో మంచి ఫలితాలు వస్తుండడంతో పాటు గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రంగా మారుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో నార్సింగి ఎంపీపీ చిందం సబీత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ దొబ్బల సుజాత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్నం రాజేందర్రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎరం అశోక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తౌర్యనాయక్, నార్సింగి సొసైటీ చైర్మన్ శంకర్గౌడ్, తాసీల్దార్ సత్యనారాయణ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సత్యనారాయణ, ఈవో యాదగిరి, ఎంపీటీసీలు ,సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.