పెద్దశంకరంపేట : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 40శాతానికిపైగా నమోదవుతున్నదని డీఈవో రమేశ్ అన్నారు. మంగళవారం ఆయన హిందీ దివస్ను పురస్కరించుకుని స్థానిక మోడల్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు బలవంత్రావు రూపొందించిన హిందీ వ్యాకరణ పుస్తకాన్ని ఆవిష్కరించి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రోజురోజుకూ విద్యార్థుల హాజరు శాతం పెరుగుతున్నదన్నారు. పెద్దశంకరంపేటలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు బలవంత్రావు విద్యార్థులకు సులభమైన రీతిలో అర్థమయ్యేలా వ్యాకరణ పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. సీజనల్ వ్యాధులతో కొన్ని రోజులుగా పాఠశాలల్లో హాజరు శాతం తగ్గిందన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులుందరూ తప్పనిసరిగ్గా కొవిడ్ టీకా తీసుకోవాలన్నారు. మోడల్ స్కూల్ ఆరోతరగతి ఉత్తీర్ణతాఫలితాలను ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రకటించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి సుభాశ్జాదవ్, ఎంఈవో పోచయ్య, ప్రిన్సిపాల్ విఠల్నాయక్, ఎస్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రామచంద్రాచారి, ఉపాధ్యాయులు తదితరులున్నారు.