మెదక్ మున్సిపాలిటీ/ నర్సాపూర్/ రామాయంపేట/ చేగుంట, డిసెంబర్ 3 : తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారి వర్ధ్దంతిని శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. జిల్లాకేంద్రం మెదక్లోని పెద్దబాజర్లో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం నాయకులు రమేశ్చారి, కృష్ణకుమార్, నాగేందర్చారి, ఉపేందర్చారి, బీజేపీ నాయకుడు ప్రసాద్ పాల్గొన్నారు.
మలిదశ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన శ్రీకాంతాచారి వర్ధంతిని నర్సాపూర్ పట్ణణంలో విశ్వబ్రాహ్మణ మన్ముయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమం లో విశ్వబ్రాహ్మణ మన్ముయ సంఘం అధ్యక్షుడు కృపాచారి, నాయకులు ఆంజనేయులుచారి, రాములుచారి పాల్గొన్నారు.
రామాయంపేటలో శ్రీకాంతాచారి 13వ వర్ధంతిని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించారు. శ్రీకాంతాచారి తెలంగాణ ధ్రువతార అని, ఆయన చేసిన ప్రాణత్యాగంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిందని జేఏసీ, స్వర్ణకార సంఘం నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వెల్ముల సిద్ధ్దిరాములు, రొయ్యల పోచయ్య, పోచమ్మల అశ్విని, రమేశ్రెడ్డి, చింతల యాదగిరి, సుంకోజు దామోదర్, చింతల స్వామి, కిష్టాపురం రామకృష్ణ, చాకలి వెంటి, చింతల శేఖర్, పోచమ్మల శ్రీనివాస్, జలగడుగుల శ్రీనివాస్, సురేశ్ నాయక్, అల్లాడి వెంకటి, శివ, విశ్వరూపం, బాలచందర్, మురళి, వెల్ముల రమేశ్, ముకుందం, కిరణ్ పాల్గొన్నారు. చేగుంటలోని గాంధీ చౌరస్తా వద్ద శ్రీకాంత్చారి చిత్రపటానికి సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ పూలమాల వేసి, నివాళు లర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ రఘువీర్రావు, నాయకులు వెంకటేశం, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
మండలకేంద్రంలో శ్రీకాంతాచారి వర్ధంతి నిర్వహించారు. తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆత్మత్యాగం చేసిన శ్రీకాంతాచారి తెలంగాణ ప్రజల్లో అమరుడుగా నిలిచాడని కొనియాడారు. కార్యక్రమంలో తసప్ మండలాధ్యక్షుడు నరేందర్రెడ్డి, నేతలు సంతోశ్, శివశంకర్, మాధవరెడ్డి, శ్రీధర్రెడ్డి, నర్సింహులు, దేవేందర్రెడ్డి, శ్రవణ్కుమార్, కృష్ణ, రమేశ్ పాల్గొన్నారు.