మెదక్ మున్సిపాలిటీ, జూన్ 24: బోధన, బోధనేతర సిబ్బంది కరో నా వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా విద్యాధికారి రమేశ్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాశాఖ సిబ్బందికి ప్రభుత్వం తగిన ఏర్పా ట్లు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీ లకంఠంతో పాటు పలువురు ఉ పాధ్యాయులు పాల్గొన్నారు.
అర్బన్ పీహెచ్ వ్యాక్సిన్ వేసుకోవాలి
జిల్లా కేంద్రంలోని అర్బన్ పీహెచ్ శుక్రవారం నుంచి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు బోధనేతర సిబ్బంది మొదటి విడత కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని మండల విద్యాధికారి నీలకంఠం గురువారం తెలిపా రు. వ్యాక్సిన్ కోసం వెళ్లే వారు ఉద్యోగులు ఐడీ కార్డులు, ఆధార్ తప్పకుండా తీసుకెళ్లాలని సూచించారు. మూ డు రోజలు పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
ఉపాధ్యాయులతో వీడియో పాఠాలు-జిల్లా విద్యాధికారి రమేశ్ కుమార్
జిల్లాలో 6వతరగతి నుంచి పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు సంసిద్ధతా కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ అన్నారు. ఆయన కార్యాలయంలో డీసీఈబీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఉపాధ్యాయులతో విషయాల వారీగా వీడియో పాఠాలు రూపొందించి డీఈవో వెబ్ డీసీఈబీ మెదక్ యూ ట్యూబ్ చానల్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ సమావేశంలో మండల విద్యాధికారి నీల కంఠం ,పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించాలి-జిల్లా విద్యాధికారి రమేశ్
అభ్యాసాన అభివృద్ధి కోసం విలీన విద్య రిసోర్స్ పర్సన్లు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రమేశ్ సూచిం చారు. డీఈవో కార్యాలయంలో జిల్లాలోని విలీన విద్యరి సోర్స్ పర్సన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రతి అంగన్ ఆశ కార్యకర్తలను సంప్రదించి 5 సంవత్సరాల లోపు ప్రత్యేక అవసరాల పిల్లల జాబితాను రూపొందించాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సమన్వయకర్తలు సూర్యప్రకాశ్ , సుభాశ్, సహాయ గణాంక సమన్వయకర్త శశిధర్, డివిజనల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మండలాల రిసోర్స్ పర్సన్లు, పాల్గొన్నారు.