కంది, జూలై 30 : కూతురి రెండో పెండ్లికి అడ్డుగా ఉన్నాడని ఓ అమ్మ మ్మ దారుణానికి ఒడిగట్టింది. రెం డేండ్ల బాలుడిని చెరువులో పడేసి, కృరత్వాన్ని ప్రదర్శించింది. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. సంగారెడ్డి డీఎస్పీ బాలా జీ, పట్టణ సీఐ రమేశ్ వివరాల ప్రకా రం.. పట్టణంలోని రాజంపేటలో నివాసముంటున్న కట్ట నాగమణికి కూతురు సుజాత ఉన్నది. ఆమెకు మధుతో కొన్నేండ్ల క్రితం వివా హం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు మహేశ్ (5), యశ్వంత్ (2) ఉన్నా రు.
సుజాత భర్త మధు రెండేండ్ల క్రితం చౌటకూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తర్వాత సుజాతకు పుల్కకల్ మండలానికి చెందిన జనార్దన్తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తనను పెండ్లి చేసుకోవాలని జనార్దన్ను కోరింది. సుజాతకు ఇద్దరు కొడుకులు ఉండడంతో అతడు రెండో వివాహానికి నిరాకరించాడు. పిల్లలను విడిచి పెడితే పెండ్లి చేసుకుంటానని చెప్పాడు. సుజాత పెద్ద కొడుకు మహేశ్ను బంధువులు దత్తత తీసుకుంటానన్నారు. రెండో కొడుకు యశ్వంత్ తన కూతురు పెండ్లికి అడ్డుగా ఉన్నాడని అమ్మ మ్మ నాగమణి భావించింది. సంగారెడ్డిలోని బొబ్బిలికుంట చెరువులో ప్రాణాలతో ఉన్న మనువడిని పారేసింది. ఊపిరాడక నీటిలో ప్రాణాలను విడిచాడు. ఈ నెల 30వ తేదీన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మొదట తల్లి సుజాత ఫిర్యాదు మేరకు బాలుడి మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు యశ్వంత్ చనిపోయిన విషయం తెలుసుకున్నారు. జనార్దన్ పోత్స్రాహంతోనే అమ్మమ్మ నాగమణి తన మనువడు యశ్వంత్ను నీటిలో పడేసినట్లు నిర్ధారించుకుని వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. 12 గంటల్లోనే కేసును ఛేదించిన పట్టణ సీఐ రమేశ్తో పాటు సిబ్బంది డీఎస్పీ బాలాజీ అభినందించారు.