సిద్దిపేట టౌన్, జూలై 17: తల్లిదండ్రుల సంరక్షణలో గడపాల్సిన బాల్యం వీధుల్లో మసకబారుతున్నది. పలక, బలపం పట్టి ఓనమాలు దిద్దాల్సిన చిన్నారులు భిక్షాటన చేస్తున్నారు. చిత్తు కాగితాలు, ఇనుప సామాన్లు సేకరించి అమ్ముకుంటున్నారు. బాల కార్మికులను గుర్తించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్ -7 బాసటగా నిలుస్తున్నది. బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థకు ప్రభుత్వం 2015లో శ్రీకారం చుట్టింది. ప్రతి ఏడాది రెండు విడుతల్లో కార్యాచరణ నిర్వహించాలని రూపకల్పన చేసింది. జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నది. చిన్నారుల్లో చిరునవ్వే లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నది. అందులో భాగంగా పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ ప్రొటక్షన్ కమిటీ, మహిళా, వైద్య, కార్మిక, విద్య, చైల్డ్ లైన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో సహాయక బృందాలుగా ఏర్పాటయ్యాయి. తప్పిపోయిన అనాథ బాలలు, భిక్షాటన చేసే వారిని గుర్తించేందుకు ఈ నెల 31 ముస్కాన్ కార్యక్రమాన్ని చేపడుతున్నది. పిల్లలను గుర్తించడానికి రెండు కేటగిరీలను విభజించారు. 14 సంవత్సరాల్లోపు ఒక కేటగిరీ, ప్రమాదకర కర్మాగారాలు తదితర వాటిల్లో పనిచేసే 15 నుంచి 18 సంవత్సరాల్లోపు పిల్లలను గుర్తించేందుకు మరో కేటగిరీగా విభజించారు.
సిద్దిపేట జిల్లాలో 3 ముస్కాన్ టీమ్లు
ఆపరేషన్ ముస్కాన్ను పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ పోలీస్ డివిజన్ల పరిధిలో 3 ముస్కాన్ టీమ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో అధికారులు, సిబ్బంది 11మంది చొప్పున పనిచేస్తారు. అందులో ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు, మి గతా అధికారులు ఉంటారు. వీరందరి పర్యవేక్షణ జిల్లా ఆపరేషన్ ముస్కాన్ నోడల్ అధికారి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాసులు పర్యవేక్షణలో కొనసాగుతుంది.
ముందుగా రెక్కీ..
బాల కార్మికులను గుర్తించేందుకు అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులతో సహాయక బృందాలుగా ఏర్పడింది. ఇటుక బట్టీలు, హోటళ్లు, కంపెనీలు, కర్మాగారాలు, సంస్థల్లో చిత్తు కాగితాలు ఏరే వారిని మొదటగా గుర్తిస్తారు. అనంతరం రెక్కీ నిర్వహించి తెల్లవారుజాము వరకే వారిని పట్టుకుంటారు. అదుపులోకి తీసుకున్న చిన్నారులను బాల సంక్షేమ సమితి వారు చైల్డ్ వెల్ఫేర్ ఎదుట హాజరుపర్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తల్లిదండ్రులు లేని ఆడ పిల్లలను సిద్దిపేట బాలసదనం, బాలురలను కొండపాక ఆనంద నిలయం, ప్రజ్ఞాపూర్ ఆశాజ్యోతి , బెజ్జంకి కృపాభవన్, లేదా కరీంనగర్ శిశుగృహకు తరలించి విద్యాబోధన అందిస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు అధికారులు రెస్క్యూ చేసి గజ్వేల్లో 7మందిని గుర్తించి ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సిద్దిపేటలో ముగ్గురు, హుస్నాబాద్లో ఇద్దరిని గుర్తించారు. మొత్తం 12 మంది బాల కార్మికులను గుర్తించింది. అందులో ఇద్దరినీ కరీంనగర్ శిశుగృహకు తరలించారు.
ఆపరేషన్ స్మైల్, ముస్కాన్లో అధికారులు
గుర్తించిన బాలల సంఖ్య
2018లో ఆపరేషన్ స్మైల్లో గుర్తించిన చిన్నారులు 47, ముస్కాన్లో 74 మంచి చిన్నారులు, 2019లో ఆపరేషన్ స్మైల్లో గుర్తించిన చిన్నారులు 207, ముస్కాన్లో 64 మంచి చిన్నారులు, 2020 ఆపరేషన్ స్మైల్లో 70 మంది, ముస్కాన్లో 2021 ఆపరేషన్ స్మైల్ 35 మంది, 2021 ఆపరేషన్ ముస్కాన్ ఇప్పటి వరకు 12 మందిని గురి్ంతంచారు.
పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు
బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్లలో బృందాలతో పర్యవేక్షణ జరుపుతున్నా యి. ఈ నెల 31 వరకు కార్యాచరణ టీమ్లు ప్రతిరోజు పర్యటించి బాల కార్మికులను గుర్తిస్తాయి. అనాథ, వసతి, తప్పిపోయిన, లైంగిక, ఆర్థిక, దోపిడీ, హింసకు, వెట్టి చాకిరీకి గురవుతున్న చిన్నారులు కనిపిస్తే 1098, డయుల్ యువర్ 100, కమిషనరేట్ వాట్సాప్ నంబరు790110100కు సమాచారం ఇవ్వాలి.
వెట్టిచాకిరీ విముక్తికి ముస్కాన్
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ఆపరేషన్ ముస్కా న్ స్మైల్ను చేపడుతున్నది. అనాథలు, భిక్షాటన, ఇటుక బట్టీల్లో విలువైన జీవితాన్ని గడుపుతున్న వారిని గుర్తిస్తున్నాం. ఇప్పటి వర కు ఆపరేషన్ ముస్కాన్లో 12 మంది కార్మికులను గుర్తించాం. బాలలకు కరోనా పరీక్షలు నిర్వహించాం. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి వారితో పంపుతున్నాం. అనాథ పిల్లలైతే వసతి గృహాలకు తరలించి చదివిస్తున్నాం.