సిద్దిపేట అక్టోబర్5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాడు సిద్దిపేట నుంచి పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ.. నేడు భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా రూపాంతరం చెంద డం చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రాంతీయ పార్టీగా స్వరాష్ట్రం సాధించి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఏకైక పార్టీ. దేశానికే దిక్సూచిగా రాష్ట్ర ప్రగతి సాధించడం జరిగింది. ఉద్యమ నేతనే సీఎం కేసీఆర్ కావడంతో ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయడంతో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి రోల్ మోడల్గా నిలిచింది. 21 ఏండ్ల పార్టీ ప్రస్థానంలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొని ఉద్యమం ఉధృతిని ఏ మాత్రం తగ్గకుండా ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించింది. పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు టీఆర్ఎస్ పై అవాకులు, చెవాకులు పే లారు. మూడొద్దులకే పార్టీ మూసుకుపోతుందని ఎ న్నో రకాలుగా హేళన చేసే మాటలు మాట్లాడారు. అ యినా ఎక్కడా కూడా కేసీఆర్ వెనుకడుగు వేయకుం డా ఉద్యమ పార్టీని ముం దుకు తీసుకెళ్లారు.
ఆనాటి ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు. సాగునీటి కోసం ఒక ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన కూడా వారికి రాకపోవడంతో రైతు లు ఆర్థికంగా దెబ్బతిన్నారు. రైతుకు సాగునీరు అందించాలనే ఆలోచన ఆనాటి పాలకులు ఎవరూ ఆలోచించలేకపోయారు. సీఎం కేసీఆర్ తానే స్వయంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ప్రాజెక్టులను నిర్మించారు. ఫలితంగా రైతాంగానికి పుష్కలంగా సాగు నీరు అందుతున్నది. ఫలితంగా రైతులు పంటలు పండించుకుంటున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి రైతులకు దన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిచింది. ఇవే పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఇక్కడి రైతుబంధును దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్నదే వివిధ రాష్ర్టాల రైతుల కోరిక. దేశంలో బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటుతుంది. యావత్తు దేశం ఇవ్వాళ సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాలలోని ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, సంక్షేమ ఫలాలను కోరుకుంటున్నారు.