సిద్దిపేట, జూలై 12 : సిద్దిపేట పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత, పరిశుభ్ర పట్టణంగా మార్చుకుందామని మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు అన్నారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రమణాచారితో కలిసి వివిధ పెండింగ్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పనులు, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలిగించడం, మొక్కలు నాటడం వంటి పను లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పై వార్డు ఆఫీసర్లను అభినందించారు. మంత్రి హరీశ్రావు కృషితో సిద్దిపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, పట్టణంలోని స్వచ్ఛబడిని సందర్శించి అందు లో తడి చెత్తతో ఎరువు ఏ విధంగా తయారవుతుందో నేర్చుకునే విధంగా చూడాలన్నారు. మెదక్ రోడ్డులో ఉన్న బాలసదనం పను లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠధామాలు, సమీకృత మార్కెట్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పట్టణ ప్రకృతి వనాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 43 వార్డులకు సంబంధించిన ప్రత్యేకాధికారులు ఆయా వార్డుల్లోని సమస్యలు తన దృష్టికి తీసుకురావాలన్నారు. అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. బయోగ్యాస్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. అనుమతులు లేకుండా ఇండ్ల నిర్మాణం చేపట్టే వారిపై చర్యలు తీసుకోవాలని, ఇంటి , నీటి పన్ను వసూలు చే యాలని, ట్రేడ్ లైసెన్స్, అడ్వటైజ్మెంట్ కలెక్షన్లు వసూలు చేయాలన్నారు. అన్ని పార్కులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.