సంగారెడ్డి, జూలై 30 : పోలీసు అధికారులు శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యంగా పని చేస్తారని, జిల్లా ప్రజలకు పోలీసుల మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి కొత్త ఎస్పీ రమణ కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి నుంచి రమణకుమార్ బాధ్యతలు తీసుకున్నారు. చంద్రశేఖర్రెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు అధికార లాంఛనాలతో పోలీసుల పరేడ్తో కొత్త ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం రిజిస్టర్లో సంతకం చేసి చార్జి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ పోలీసుల సేవలు ప్రజలకు అందించే విధంగా పరిపాలనా సౌలభ్యం చేస్తామన్నారు. పోలీసులకు జిల్లా ప్రజల నుంచి సహకారం ఉండాలని, ముఖ్యంగా మీడి యా సమన్వ యం ఉంటేనే ముందుకు సాగుతామన్నారు. సం ఘ విద్రోహ శక్తుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శాంతిసామరాస్యాలను కాపాడేందుకు పోలీసుల సేవలు అందుబాటులో ఉంటాయని ఎస్పీ భరోసా ఇచ్చారు.
చంద్రశేఖర్రెడ్డికి ఘనంగా వీడ్కోలు..
సుదీర్ఘ్ఘకాలం జిల్లాకు సేవలందించిన ఎస్పీ చంద్రశేఖర్రెడ్డికి పోలీసు అధికారులు అధికార లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. శుక్రవారం కొత్త ఎస్పీకి బాధ్యతలు అప్పగించిన అనంతరం ప్రత్యేక వాహనానికి తాళ్లు కట్టి లాగుతూ అభిమానాన్ని చాటుకున్నారు. సాయంత్రం కొం డాపూర్ మండలం మల్కాపూర్లోని గోకుల్ గార్డెన్ ఫంక్షన్ హాలులో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో పోలీసు అధికారులు, రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.