సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 24 : పేదలకు ఆహార భద్రత కలగనున్నది. రేషన్ సరుకులతో పాటు అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడే రేషన్ కార్డు ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబీకుని కల. ప్రభుత్వం అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం మొత్తం 11,281 మంది దరఖాస్తు చేసుకోగా, ఆయా దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించిన అధికారులు 8,139 మంది అర్హులు అని అధికారులు గుర్తించారు. మంజూరైన కొత్త రేషన్ కార్డులను ఈ నెల 26 నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ జరుగనున్నది. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారుల పర్యవేక్షణలో, మండలంలో సంబంధిత తహసీల్దార్ల ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రేషన్ కార్డుల పంపిణీ సమయంలో కార్డులను తీసుకుని లబ్ధిదారులు తమ ఆధార్ నెంబర్తో మీ సేవా కేంద్రానికి వెళ్లి ఆహార భద్రత కార్డును డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.
నియోజకవర్గాల వారీగా మంజూరైన కార్డులు
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల వారీగా మంజూరైన కొత్త రేషన్ కార్డుల వివరాలు ఈవిధంగా ఉన్నాయి. అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గానికి 2022 రేషన్ కార్డులు మంజూరు కాగా, అమీన్పూర్ మండలానికి 230 రేషన్ కార్డులు, గుమ్మడిదల 275, జిన్నారం 551, పటాన్చెరు 757, రామచంద్రాపురం 209 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. జహీరాబాద్ నియోజకవర్గానికి 1819 రేషన్ కార్డులు మంజూరు కాగా, ఝరాసంఘం మండలానికి 237, కోహీర్ 270, మొగుడంపల్లి 179, న్యాల్కల్ 467, జహీరాబాద్ 666 కార్డులు మం జూరయ్యాయి. నారాయణఖేడ్ నియోజకవర్గానికి 1288 కార్డులు మంజూరు కాగా, కల్హేర్ మండలానికి 226, కంగ్టి 299, మనూర్ 146, నాగల్గిద్ద 166, నారాయణఖేడ్ 298, సిర్గాపూర్ 153 కార్డులు, అందోల్ నియోజకవర్గానికి 1233 కార్డులు మంజూరు కాగా, అందోల్ మండలానికి 301 రేషన్ కార్డులు, చౌటకూర్ 120, మునిపల్లి 222, పుల్కల్ 152, రాయికోడ్ 239, వట్పల్లి 199 కార్డులు మంజూరయ్యాయి. జిల్లాలో అత్యల్పంగా సంగారెడ్డి నియోజకవర్గానికి 1382 రేషన్ కార్డులు మంజూరు కాగా, కంది మండలానికి 156, కొండాపూర్ 154, సదాశివపేట 460, సంగారెడ్డి మండలానికి 612 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గంలో మిగిలిపోయిన హత్నూర మండలానికి 395 రేషన్ కార్డులు మంజూరయ్యాయి.
మెదక్ జిల్లాకు కొత్తగా 3,368
ఆహార భద్రత కార్డులు మంజూరు
మెదక్, జూలై 24 : మెదక్ జిల్లాలో నూతనంగా గుర్తించిన 3,368 మంది లబ్ధిదారులకు ఈ నెల 26 నుంచి ఆహార భద్రత కార్డులు పంపిణీ చేయనున్నట్లు మెదక్ కలెక్టర్ హరీశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 3,689 దరఖాస్తులు రాగా, 321 దరఖాస్తులు తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. నూతనంగా గుర్తించి 3,368 మంది లబ్ధిదారులకు ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఆయా మండలాల్లో కొత్త కార్డులు పంపిణీ చేయ నున్నట్లు తెలిపారు. మండలాల వారీగా ఆహార భద్రత కార్డుల మంజూరు వివరాలు.. అల్లాదుర్గం 115, చేగుంట 271, చిలిపిచేడ్ 98, హవేళీఘణాపూర్ 122, కొల్చారం 256, కౌడిపల్లి 321, మనోహరాబాద్ 76, మెదక్ 165, నర్సాపూర్ 231, నార్సింగి 106, నిజాంపేట 120, పాపన్నపేట 233, రామాయంపేట 193, రేగోడ్ 151, పెద్దశంకరంపేట 164, చిన్నశంకరంపేట 100, శివ్వంపేట 200, టేక్మాల్ 184, తూప్రాన్ 93, వెల్దుర్తి 169 ఆహార భద్రతా కార్డులను అందజేయనున్నట్లు తెలిపారు.
ఆగస్టు నుంచి రేషన్ సరుకులు
సంగారెడ్డి జిల్లాలో మొ త్తం 8,139 మంది లబ్ధిదారులకు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయను న్నాం. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో మొత్తం 11,281 దరఖాస్తులు అందగా, స్క్రూ టీని తర్వాత అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశాం. సోమవారం నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నాం.