రామచంద్రాపురం, అక్టోబర్18: బీహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు మంగళవారం భెల్లో జరిగాయి. కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీలో మొత్తం 10 మంది సభ్యులు ఉండగా, అందులో అధ్యక్షుడు, కార్యదర్శి, ఇద్దరు డైరెక్టర్లను భెల్ యాజమాన్యం నేరుగా నియమిస్తుంది. మరో ఆరు మంది డైరెక్టర్ల కోసం ఎన్నికల అధికారి జిల్లా డీసీవో ప్రసాద్ నేతృత్వంలో ఎన్నికలు జరిగాయి. ఎంప్లాయీస్ కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీలో మొత్తం 3029 ఓట్లు ఉన్నాయి. ఉద్యోగులు వారి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. భెల్లోని విద్యాభారతీ స్కూల్లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో మొత్తం 25మంది అభ్యర్థులు బరిలో నిలబడగా, ఓపెన్ క్యాటగిరీలో 16మంది, ఉమెన్ క్యాటగిరీలో 6గురు, ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీలో ముగ్గురు పోటీపడ్డారు. 3029 ఓట్లకు 2643ఓట్లు పోలవగా, ఎన్నికల్లో 87 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. భెల్లో కో-ఆపరేటీవ్ సొసైటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం ఎంప్లాయీస్ కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు.