మెదక్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి వర్క్ సైట్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వర్క్ ఫైళ్లు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని కలె క్టర్ ఎస్.హరీశ్ అధికారులకు సూచించారు. గురువారం డీఆర్డీవో, జడ్పీ సీఈవో, డీపీవో, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు బాగా జరుగుతున్నాయని, వాటికి సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను నాలుగైదు రోజుల్లోగా మీ పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శించి గుడ్ గవర్నెన్స్ ప్రకా రం వర్క్ సైట్ బోర్డులు, వర్క్ ఫైళ్లతో పాటు ఏడు రకాల రిజిస్టర్లు సక్రమంగా నిర్వహిస్తున్నారా పరిశీలించి పూర్తి చేయాలని సూచించారు.
వర్క్ ఫైల్లో పని వివరాలు, అంచనా, గ్రామ పంచాయతీ తీర్మాణాలు, పనికి సంబంధించిన ఫొటోలు తదితర అన్ని వివరాలతో డాక్యుమెంట్లు ఉండాలన్నారు. టెక్నికల్ అసిస్టెం ట్లు తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులు పర్యవేక్షించేలా చూడాలన్నారు. గత సంవత్సరంన్నర నుంచి చేపట్టిన పనుల ప్రగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, అట్టి పనుల పురోగతి ప్రస్పుటంగా కనిపించాలని కలెక్టర్ సూచించారు. జాబ్ కార్డు వివరాలు అప్డేగ్గా ఉండాలని, అట్టి కార్డులను రాండమ్గా పరిశీలించాలని, శ్రామికులతో ముఖా ముఖి అయి రోజు రూ.245 కూలీ రావాలంటే ఎంత పని చేయాలో అవగాహన కల్పించాలని సూచించారు.
వేసవిలో, శీతాకాలంలో ఫామ్ పాండ్స్, ట్రెంచ్చ్ వంటి మట్టి పనులకు ఎంత కూలీ ఇస్తారో మహిళా సర్పంచులకు తెలిసేలా అధికారులు అవగాహన కలిగించాలన్నారు. అదే విధంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులు, డబ్బు చెల్లింపు వివరాలపై సర్పంచులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్, డీఆర్డీవో శ్రీనివాస్, జడ్పీ సీఈవో శైలేష్, డీపీవో తరుణ్కుమార్, ఎంపీడీవోలు, ఎపీవోలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.