మెదక్ మున్సిపాలిటీ : మెదక్ చర్చి భక్తులతో సందడిగా మారింది. ఆదివారం కావడంతో వందలాది మంది భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు పాల్గొని యేసుక్రీస్తుకు మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం చర్చి కాంపౌండ్ ఆవరణలోని చెట్ల కింద వంటావార్పు చేసుకున్నారు. ఈ సందర్భంగా చర్చి ప్రేసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ అండ్రూస్ ప్రేమ్సుకుమార్ భక్తులనుద్ధేశించి దైవ సందేశం చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రభువు చూపిన మార్గంలో నడవాలని సూచించారు. ప్రార్థనల్లో పాస్టర్లు దయానంద్, రాజశేఖర్, జైపాల్, అనుగ్రహలతోపాటు చర్చి కమిటీ సభ్యులు రోలండ్పాల్, ఉదయ్కిరణ్, శాంతికుమార్, సంశాన్సందీప్ పాల్గొన్నారు.