మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపల్ పరిధిలోని గృహదారులు తమ తమ ఇంటి ఆస్తి పన్నులను డిజిటల్ (ఆన్లైన్)పద్ధతిలో చెల్లించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చాలా మంది నగదు రూపంలో మున్సిపల్ కార్యాలయాల్లో చెల్లిస్తున్నారని.. అలా కాకుండా డిజిటల్ పద్ధతిలో వివిధ మార్గాల ద్వారా చెల్లించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటి పన్నులే కాకుండా కుళాయి బిల్లులు, ట్రేడ్ లైసెన్స్ చార్జీలు, ప్రకటన చార్జీలతో పాటు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన అన్ని రకాల చెల్లింపులు ఆన్లైన్లో చెల్లించాలన్నారు.