మెదక్, ఏప్రిల్ 27 : హనుమాన్ జయంతి మెదక్ పట్టణ గోసముద్ర తటాక తీరాన వెలిసిన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం 108 లీటర్ల ఆవుపాలతో అభిషేకం చేశారు. ఆలయ వంశానుగత ధర్మకర్త కాకులవరం మధుసూదనాచారి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
హనుమాన్ జయంతి సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట కౌన్సిలర్ బీమరి కిశోర్, నాయకులు లింగారెడ్డి, రాగి అశోక్, సతీష్, నవీన్ ఉన్నారు.
పెద్దశంకరంపేట, ఏప్రిల్27: హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలోని తిర్మలాపురం ఆంజనేయస్వామి ఆలయం, రామాలయంలో హనుమాన్ జయంతి భక్తులు ఘనంగా నిర్వహించారు. కరోనా దృష్ట్యా ఆలయంలో భౌతిక దూరం పాటించి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీపంతులు తదితరులున్నారు.
హవేళిఘనపూర్….
హవేళిఘనపూర్,ఏప్రిల్27: మండల పరిధిలోని సర్దన వేంకటేశ్వరాలయంలో ఆంజనేయస్వామికి టీఆర్ఎస్ జిల్లా నాయకులు సతీష్రావు ఆధ్వర్యంలో స్వామివారికి వెండి కిరీటాన్ని బహూకరించారు. అనంతరం వైస్ ఎంపీపీ రాధాకిషన్యాదవ్, టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్రావు పూజలు నిర్వహించారు.
రేగోడ్….
రేగోడ్, ఏప్రిల్ 27: హనుమాన్ జయంతి మండల ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు.
మెదక్ మున్సిపాలిటీ…
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 27: హనుమన్ జయంతి పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు హనుమన్ దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు