తూప్రాన్/రామాయంపేట: కొవిడ్ టీకాపై నిర్లక్ష్యం తగదని, 18 ఏండ్లు నిండిన వారందరూ తప్పనిసరిగ్గా టీకా తీసుకోవాలని, సీజనల్ వ్యాధులపై ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. సోమవారం తూప్రాన్, మున్సిపల్లోని ప్రభుత్వ దవాఖానను ఆయన సందర్శించి పలువురికి కొవిడ్ టీకాలు పంపిణీ చేసి, డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దవాఖానలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో కొవిడ్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా నాలుగు రోజుల్లో లక్ష వరకు కొవిడ్ టీకాలు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాలో అత్యధికంగా తూప్రాన్ ప్రభుత్వ దవాఖానలోనే కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. ఆదివారాలు, పండుగలు ఎలాంటి సెలవులు లేకుండా కలెక్టర్ ఆదేశాల ప్రకారం వైద్య సిబ్బంది ,డాక్టర్లు పని చేస్తున్నారన్నారు. విలేకరులు సమావేశంలో తూప్రాన్ సీహెచ్సీ ప్రభుత్వ వైద్యులు ఆనంద్, సూపర్వైజర్ బాలనర్సయ్య, పల్లవి, ఏఎన్ఎం రేణుక, హెల్త్ అసిస్టెంట్ దుర్గారెడ్డి ఉన్నారు.