మెదక్ : ప్రతి ఊరిలో జమ్మి పేరుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ దసరా పండుగ సందర్భంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జమ్మి మొక్కలను నాటారు.
దసరా ఉత్సవాల్లో జమ్మి చెట్టుకు ఉన్న ప్రాధాన్యం, ప్రజల సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషకరంగా ఉందన్నారు. మెదక్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో జమ్మి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.